సాధారణంగా చాలా మంది ఉదయాన్నే వేడి వేడిగా
కాఫీ లేదా టీ తాగి రోజు మొదలు పెడతారు. దీంతో నిద్ర మత్తు వదిలి యాక్టివ్గా ఉండవచ్చని వారి భావన. అయితే మన శరీరానికి ఆరోగ్యకరమైన ద్రవాలు అందించడం చాలా ముఖ్యం. కానీ అవి
కాఫీ లేదా టీ కాదు. ఎందుకంటే ఇవి శరీరాన్ని మరింత
డీహైడ్రేషన్ కు గురిచేస్తాయి.
కాఫీ లేదా టీ తాగడానికి బదులు మనం ఆరోగ్యకరమైన పానీయం తాగాలి. అప్పుడే అలసిపోయి ఉన్న మన శరీరానికి తక్షణశక్తి లభిస్తుంది.
ఉదయాన్నే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగడం వల్ల కొన్ని వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ ఆరోగ్యం చాలా రకాలుగా మెరుగుపడుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, మీ జీవక్రియను పెంచుతుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు రావు. జ్వరం, దగ్గు, జలుబు వంటివి త్వరగా తగ్గుముఖం పడతాయి. అలాగే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదే విధంగా అలోవెరా సారం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి పొట్టలో పుండ్లు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి.