మీరు ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నారా..? అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే. మీరు భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు వస్తాయి..  గుర్తుంచుకోండి. మానసికంగా సిద్ధంకండి. ఏంటో ఆ ఉద్యోగాలు అని అనుకుంటున్నారా ? అవేం ఉద్యోగాల్లో ఇక్కడ చదవండి. ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్లడం సాయంత్రం 5 గంటల వరకు ఫైళ్లు, కంప్యూటర్లతో కుస్తీ పట్టడం, ఇంటికి తిరిగిరావడం. 

 

చాలా మంది ఉద్యోగస్తుల రోజు వారీ జీవితం ఇలాగే సాగుతుంది. అయితే ఇలాంటి జాబ్‌లతో కుస్తీపట్టే ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తప్పవని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒకే చోటు కూర్చుని ఏకబిగిన ఇన్నేసి గంటలు పనిచేస్తే అధిక రక్తపోటుతోపాటు అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 

 

3500 మంది కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యాన్ని విశ్లేషించిన మీదట కెనడాలోని లావల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు. వారానికి 40 గంటలు పైబడి పనిచేసే ఉద్యోగుల్లో అంతకంటే తక్కువ పనిగంటలు పనిచేసే వారితో పోలిస్తే అధిక రక్తపోటుకు గురయ్యే ముప్పు మూడింట రెండు వంతులు ఎక్కువని వెల్లడైంది.

 

వారానికి 5 రోజులు పనిచేసే వారిలో 50 శాతం హైపర్‌టెన్షన్‌కు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక వారానికి 35 గంటలే పనిచేసేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఇక వారానికి 49 గంటలకు పైగా పనిచేసే వారిలో ఈ రిస్క్‌ ఏకంగా 70 శాతంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు.

 

పని ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం కొరవడటం ఈ పరిస్ధితికి దారితీస్తోందని అథ్యయనం తెలిపింది. అధిక రక్తపోటు గుండె పోటు, కిడ్నీ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. ఐదేళ్ల పాటు సాగిన ఈ అథ్యయనంలో మూడు ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులను పరీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: