పసుపు.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు. ప్రకృతి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన హెర్బ్ పసుపు. వంటల్లో విరివిరిగే ఉపయోగించే పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. పసుపు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఈ క్రమంలోనే కొందరు వేడి నీటిలో పసుపు కలిపి తాగుతుంటారు. కానీ, కొందరు మాత్రం ఇలా తాగడం వల్ల వేడి చేస్తుందని లేదా ఇతరితర కారణాల వల్ల తాగడానికి ఇష్టపడరు.
అయితే వాస్తవానికి పసుపు నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ కరోనా టైమ్లో పసుపు నీరు తాగితే.. పసుపులో లిపోపాలిసాకరైడ్ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్లూ మరియు జలుబు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు పసుపు నీరును తాగడం వల్ల మెటబాలిజంను రేటును పెంచుతుంది. తద్వారా శరీరం లో ఎక్కువ ఫ్యాట్స్ ఏర్పడకుండా నిరోధించి.. బరువును తగ్గిస్తుంది. మరియు పసుపు నీరు తీసుకోవడం గుండె జబ్బుల నివారణలో ప్రయోజనకరంగా ఉంటుంది.
అదేవిధంగా, డయాబెటిస్ ఉన్నవాళ్ళు ప్రతి రోజు పసుపు నీరు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం నిరోధించడానికి సహాయపడ్తుంది. పసుపు నీరు తీసుకోవడం వల్ల శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో కాన్సర్ రాకుండా నివారిస్తుంది. పసుపు శరీరంలో కాన్సర్ దరి చేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని వివిధ కణాలను కాన్సర్ ఎదుర్కొనేట్లు చేస్తుంది. మరియు క్రమం తప్పకుండా పసుపు నీరు తాగడం వల్ల కీళ్ళనోప్పులు, కండరాల నోప్పులు తగ్గుతాయి. కాబట్టి, ప్రతి ఒక్కర తమ డైలీ డైట్లో పసుపు నీరు చేర్చుకోవడం మంచిది.