మనిషి మరణం  తర్వాత ఏం జరుగుతుంది?   చనిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తాడా అసలు పునర్జన్మ ఉంటుందా అంటే ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే తాజాగా ఆస్ట్రేలియా కు చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు తాను ప్రిన్సెస్ డయానా అని చెబుతున్నాడు. డియాన జీవితంలో ఎవరికీ తెలియలేని విశేషాలను గుర్తు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.


ఆ నాలుగేళ్ళ చిన్నారి పేరు బిల్లి క్యాంప్ బెల్, ఆస్ర్టేలియన్ టీవీ ప్రెజెంటర్ డేవిడ్ క్యాంప్ బెల్ కొడుకు. అయితే తాను గత జన్మలో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా అని  ఇది తనకు పునర్జన్మ అని చెప్తుంటాడు. రెండేళ్ళ వయసులో డయానా ఫోటోలు చూసి ఇది తానేనని ప్రిన్స్ విలియం ప్రిన్స్ హ్యారీ తన పిల్లలని అనేవాడట.  ప్రిన్స్ చార్లెస్ తో గడిపిన రోజుల గురించ్చి కూడా గుర్తుచేసే వాదట. అయితే చిన్నతనం లో ఏదో చెప్తున్నాడని బిల్లి మాటలను పట్టించుకోలేదు అతని తల్లి.


కానీ ఇటీవల ఎవరికీ తెలియని మరో ఆసక్తికర నమ్మలేని విషయం గుర్తు చేసి ఆశ్చర్యపరిచాడట బిల్లి. డయానాకు జాన్ అనే సోదరుడు ఉన్నాడని పుట్టిన కొద్ది గంటల్లోనే అతడు చనిపోయాడని చెప్పాడట. దాంతో బిల్లీ మాటలు నమ్మాల్సివస్తోందని అన్నాడు క్యాంప్ బెల్.  ప్రిన్సెస్ డయానా సాధారణ కుట్టుంభంలో  జన్మించి 1989 లో ప్రిన్స్ చార్లెస్ ను పెళ్ళి చేసుకుని  కోడలి గా అడుగు పెట్టారు.  ప్రపంచ వ్యాప్తం గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. 


కానీ 1997 లో జరిగిన ఓ కారు ప్రమాదంలో  తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తరువాత 18 ఏళ్ళ తరువాత పుట్టిన ఈ నాలుగేళ్ల కుర్రాడు.  తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానా అని సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నట్టు, నాలుగేళ్ళ వయసులో వచ్చిరాని మాటలతో ఏదో చెప్తున్నాడులే అని బిల్లి మాటలకు ప్రాదాన్యం ఇవ్వలేదు తల్లిదంద్రులు. తరువాత అతను చెప్తున్న గుర్తులు చూసి ప్రవర్తన చూసి నమ్మక తప్పట్లేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: