హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా మిర్చి. అనుష్క, రిచా గంగోపాధ్యాయ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే మిర్చి సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రామ్ చరణ్ హీరోగా వినాయక్ రూపొందిస్తన్న నాయక్ తో పాటు, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో అంత్యత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా జనవరిలో నెలలో విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాలను భారీ ఎత్తున అత్యధిక థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కారణంగా మిర్చి సినిమాకు ధియేటర్ల సమస్య తలెత్తుతుంది. దీంతో మిర్చి సినిమాను వెనక్కి జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: