నాయక్ సాధించిన కమర్షియల్ హిట్ తో రామ్ చరణ్ మాంచి జోరుమీదున్నాడు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన తరవాతి చిత్రం ఎవడు కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. మూడురోజులుగా జరుగుతున్న ఈ షూటింగ్ లో శ్రుతిహాసన్ కూడా పాల్గొంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ఉభయగోదావరి జిల్లాల హక్కులను గీతా ఆర్ట్స్ సంస్థ సొంతం చేసుకుంది. అంటే, చెర్రీ మేనమామ అల్లు అరవింద్ సొంతం చేసుకున్నాడన్నమాట. మరి, చెర్రీ ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు? ఈ విషయంలో చెర్రీ ఆచితూచి అడుగువేసినట్టు సమాచారం. ఇంతని తొందరపడి తీసేసుకోకుండా... ఫలానా ప్రాంత హక్కులు కావాలని అడగాలనుకున్నాడట. చెర్రీ మనసు తెలుసుకున్న దిల్ రాజు స్వయంగా... నైజాం ప్రాంత చిత్ర హక్కులను చెర్రీకి రెమ్యునరేషన్ గా ఇచ్చాడట. సంపాదన పాఠాలు అప్పుడే చెర్రీకి వంటబట్టేసినట్టున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: