రచయిత దర్శకుడిగా మారి ఇండస్ట్రీ షేక్ అయ్యే హిట్స్ కొడుతున్న కొరటాల శివకు తను చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా విషయంలో కొత్త సమస్య వచ్చిపడ్డదని ఫిల్మ్ నగర్ టాక్. రచయితగా దర్శకుడిగా ఎన్నేళ్ల అనుభవం ఉన్నా తనకు రావాల్సిన దాన్ని ఆర్టిస్ట్ ల దగ్గర నుండి తీసుకోవడం దర్శకుడి పని అయితే ఈ విషయంలో కొరటాల శివకు మలయాళ స్టార్ నుండి కొద్దిపాటి అసంతృప్తి ఉందట.


గ్యారేజ్ సినిమాలో దాదాపు ముగ్గురు మలయాళ స్టార్స్ నటిస్తున్నారు. మోహన్ లాల్ తో పాటుగా ఉన్ని ముకుందన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శివ చెబుతున్న సీన్ గురించి కాకుండా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడట మోహన్ లాల్. అయితే ఈ విషయంలో తనతో ఇంతకుముందు కూడా కొద్దిపాటి చర్చ జరిగినా రెండు సినిమాల అనుభవమే కదా నీది అన్నట్టు కొరటాల శివతో ప్రవర్తన ఉందట.


ఇక మోహన్ లాల్ ఏ భాషలో చేసినా తన రోల్ కు తానే డబ్ చెప్పుకోవడం కూడా యూనిట్ కు టెన్షన్ పెట్టిస్తుంది. ఇప్పటికే మనమంతా సినిమాకు ఓన్ డబ్బింగ్ చెబుతున్న మోహన్ లాల్ ఆ సినిమా టీజర్, ట్రైలర్ లోనే విమర్శల పాలయ్యేలా చేస్తున్నాడు. అయితే సినిమా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి థియేటర్ లో ఆ ఫీల్ ఉండదు అని చెబుతున్నా ఇంకా మోహన్ లాల్ వాయిస్ మీద డౌట్ తీరలేదు. 


ప్రస్తుతం జనతా గ్యారేజ్ లో కూడా మెయిన్ రోల్ పోశిస్తున్న మోహన్ లాల్ సినిమాలో కూడా తన రోల్ కు తానే డబ్ చెబుతా అన్నాడట. ఆ విషయంలో కూడా కొరటాల శివ కాస్త టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. మరి యంగ్ టైగర్ కన్విన్స్ చేసి ఏదన్నా చేస్తే తప్ప ఈ మ్యాటర్ అంత తేలిగ్గా తేలేలా లేదు.   



మరింత సమాచారం తెలుసుకోండి: