పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’. బ్యాకాంగ్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని టీమ్ అంతా ఈ మధ్యనే హైదరాబాద్ కి చేరుకుంది. రెండో షెడ్యూల్ మరో రెండు రోజుల్లో మొదలుకానుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ వారం కిందటే స్పెయిన్ వెళ్లిపోయాడు. అక్కడ షూటింగ్ చేయాలనుకుంటున్న లొకేషన్లలను ఆయన పరిశీలిస్తున్నారు. బుధవారం నాటికి అల్లు అర్జున్ తోపాటూ ఇతర చిత్ర యూనిట్ కూడా స్పెయిన్ చేరుకుంటుంది. అక్కడ రెండు వారాల పాటు చిత్రంలోని కీలకమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అలాగే ఓ పాట కూడా స్పెయిన్ లో తీయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలుగా అమలాపాల్, కేథరీన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: