దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా రాజమౌళి సైతం ఈ మూవీకి భారీ ప్రమోషన్ ప్లానింగ్స్ ని చేస్తున్నారు. బాహుబలి2 థియోట్రికల్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఈ మూవీని అందరూ చూడాలని ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టం అయింది.


దీనికి తగ్గట్టుగా థియోటర్స్ ని సైతం సర్దుబాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లకు హీరోయిన్స్ అంతగా సపోర్ట్ చేయటం లేదంట. ప్రి రిలీజ్ ఫంక్షన్ తరవాత ముంబాయ్ లో జరిగిన రెండు కార్యక్రమాలు, తమిళ ఆడియో లాంచ్ మినహా మిగతా ప్రమోషన్స్ కి హీరోయిన్స్ వచ్చేది లేదు అని చెప్పారంట. దీంతో సీరియస్ అయిన రాజమౌళి…హీరో,హీరోయిన్స్ ని కలిసి రిలీజ్ వరకూ చేయాల్సిందే అని చెప్పారు.


ఈ ప్రమోషన్స్ కి డేట్స్ ని కచ్ఛితంగా ఇవ్వాల్సిందే అని సీరియస్ అయ్యారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో మీరో చూడండి? అంటూ రియల్ వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. దీంతో తమన్న, అనుష్కలు వారి అప్ కమింగ్ మూవీలకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కి కొంత బ్రేక్ చెప్పి… బాహుబలి2 ప్రమోషన్స్ కి డేట్స్ ని ఇచ్చారని అంటున్నారు. దీంతో తాజాగా ముంబై ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్, అనుష్క లు పాల్గొన్నారు.


అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో పాల్గొంటున్నారు. వీరిద్దరూ కలసి టివి ఇంటర్వ్యూ కార్యక్రమాలను మొదలు పెట్టారు. అలాగే కేరళ, తమిళనాడులోని ప్రమోషన్ కార్యక్రమాలకు తమన్న హాజరుకానున్నారు. రిలీజ్ కి ముందు రోజు వరకూ ప్రమోషన్ యాక్టివిటీస్ జరగాలనది రాజమౌళి నిర్ణయం. మొత్తంగా రాజమౌళి కోపానికి హీరోయిన్స్ ఒక్కసారిగా వణికిపోతున్నారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. ఇక దేశవ్యాప్తంగా బాహుబలి2 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ లో దాదాపు 1100 స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదలవుతుంది. అలా దేశం మొత్తం మీద ఈ మూవీ 6,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: