జనతా గ్యారేజ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా బాబి చెప్పిన జై లవకుశ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా బిజినెస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. జనతా గ్యారేజ్ కలక్షన్స్ 85 కోట్లు రాగా ఇప్పుడు జై లవకుశ ప్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్లు చేస్తుండటం విశేషం.  


ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే బిజినెస్ లో ఎన్.టి.ఆర్ కెరియర్ లోనే కాదు ఏ సినిమాకు లేనంత క్రేజ్ వచ్చింది. నాన్ బాహుబలి రికార్డులన్ని బ్రేక్ చేస్తూ తారక్ జై లవకుశ రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఏరియాల వారిగా నైజాం 28 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, ఆంధ్రాలో 40 కోట్ల దాకా జై లవకుశ హంగామా చేస్తుంది. 


సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తుండటం ఫస్ట్ లుక్ లో తారక్ నెగటివ్ లుక్ తో సంచలనం సృష్టించడం ఇందతా జై లవకుశ మీద గురి పెట్టుకునేలా చేశాయి. కళ్యాణ్ రాం కూడా జై లవకుశ మీద ఉన్న నమ్మకంతో బడ్జెట్ లిమిట్ లేకుండా పెట్టేస్తున్నాడట. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 85 కోట్ల బిజినెస్ చేసిన జై లవకుశ వరల్డ్ వైడ్ ఇంకెంత రికార్డ్ రేటుకి పరుగెడుతుందో చూడాలి.  


సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ ల గ్లామర్ కూడా అదనపు ఆకర్షణ అవుతుందట. దేవి మ్యూజిక్ అదిరిపోయే సాంగ్స్ వస్తున్నాయట. సో మొత్తానికి జై లవకుశ రాబోతున్న క్రేజియెస్ట్ సినిమాల్లో ఒకటి. మరి ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: