యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవ కుశ సినిమా ఆడియో వేడుకను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్ ఇప్పటికే ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. గణేష్ నిమజ్జనం కారణంగా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసుకున్న చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.


ఈ నెల 10న జై లవ కుశ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరుగనుందట. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ఈ వేడుకలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన జై, లవ టీజర్లు సినిమా మీద హోప్స్ పెంచేశారు. ఈ ఇయర్ రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటైన జై లవ కుశ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్నో కథలను విన్న తారక్ మనసుకి నచ్చి మరి చేసిన సినిమా జై లవ కుశ.


దసరా బరిలో దుమ్ముదులిపే సినిమాగా సత్తా చాటేందుకు వస్తున్న ఎన్.టి.ఆర్ జై లవ కుశ అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి. రీసెంట్ గా ఆడియో రిలీజ్ లో మాత్రం తారక్ కాన్ఫిడెన్స్ చూస్తే సినిమా మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పకనె చెప్పాడనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: