టైటిల్ చూసి అటు పవన్ ఫ్యాన్స్.. ఇటు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉంటారని చెప్పొచ్చు. సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇస్తానని చెప్పిన జనసేన అధినేత ఇప్పుడు కొత్తగా నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ క్రీయాశీల రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నాడు.


హీరోగా సినిమా తీసే టైం లేదు.. అఫ్కోర్స్ అజ్ఞాతవాసి ఫ్లాప్ తో ఆ మూడ్ కూడా లేదన్నట్టు తెలుస్తుంది. అందుకే పవన్ నిర్మాతగా మారబోతున్నాడు. అది ఇది కాదు ఏకంగా ఎన్.టి.ఆర్ సినిమానే నిర్మించబోతున్నాడట. ఈమధ్యనే తారక్, త్రివిక్రం సినిమా ముహుర్తం పెట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా ఈ కార్యక్రమం జరిగింది.


అయితే ఆ సినిమా నిర్మాత రాధాకృష్ణతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటున్నాడట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ హీరోగా ఓ సినిమా వస్తుంది. ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాడట పవన్ కళ్యాణ్. కచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పొచ్చు.


ఇక త్రివిక్రం ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా రాస్తున్నాడట. అజ్ఞాతవాసి రిజల్ట్ తర్వాత తారక్ చెప్పిన కొన్ని మార్పులను ఫాలో అయ్యి కథలో కొంత ఛేంజెస్ చేశాడట. మొత్తానికి ఎన్.టి.ఆర్, పవన్ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: