టాలీవుడ్ లో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన కెరీర్లో ఎప్పుడూ చేయని ప్రయోగాం ఈ సినిమాలో చేశాడు. మొదట పూర్తి స్థాయిలో నెగిటీవ్ షేడ్ లో నటించి తర్వాత హీరోయిజాన్ని చూపిస్తాడు. ఇక కాజల్ అయితే తన అందంతో కుర్రాళ్ల మనసు దోచింది.
ఈ సినిమాలో క్లయిమాక్స్ కోర్టు సీన్లు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకున్నాయి. టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో 'సింబా' పేరిట రణ్ వీర్ సింగ్ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాత కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు హీరోయిన్ను ఫైనల్ చేశారు. సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో నటించనుందంటూ గతంలో పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అంతకు ముందు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని కూడా అనుకున్నారట. ఈ రూమర్స్ చెక్ పెడుతూ చిత్రయూనిట్ సారా అలీఖాన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన సారా ప్రస్తుతం కేదార్నాథ్ షూటింగ్లో బిజీగా ఉంది. సింబాతో సారా ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న విడుదల కానుంది. ఈ మేరకు రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ లు ఆమెతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా, సారా అలీఖాన్ ‘కేదార్ నాథ్’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది.