‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో దాదాపు పదేళ్ల విరామం తర్వాత మెగస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు.  అప్పట్లో ఆయన సినిమాల్లో నటించడం కష్టమని..అప్పటి ఛరిష్మా ఉంటుందా అన్ని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులు షాక్ తిన్నారు..మెగాస్టార్ ఇండస్ట్రీ నుంచి వెళ్లే ముందు ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఎలాగైతే ఉన్నారో..ఇప్పడూ అదే స్టామినా తో నటించడం చూసి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సంబరాలు చేసుకున్నారు. 
Image result for saira narasimha reddy
మెగాఫ్యాన్స్ ఎప్పటికీ చిరునే నెంబర్ వన్ అంటూ తెగ పొగిడేశారు.  మంచి మెసేజ్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కావాల్సినంద మాస్ మసాలా ఈ సినిమాలో ఉండటంతో చిరంజీవికి ఇండస్ట్రీలో మరోసారి సత్తా చాటారని సంతోష పడ్డారు.  ప్రస్తుతం ‘ధృవ’ దర్శకులు సురేందర్ రెడ్డి తో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి స్వతంత్ర పోరాట యోధుడి సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో మెగాస్టార్ పూర్తి తరహా యోధుడిగా కనిపించబోతున్నారు.  చిరు సరసన నయనతార నటిస్తుంది. మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్నారు. 
Image result for saira narasimha reddy
ఇక జగపతి బాబు, విజయ్ సేతు పతి లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో బాహుబలితో పాపులర్ అయిన మిల్కీ బ్యూటి తమన్నా కూడా నటిస్తుంది.  చిరుతో నటించాలన్న తన కల నెరవేరబోతున్నందుకు తెగ సంతోష పడుతుంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ‘సైరా’ సినిమాలో ఒక వారియర్ పాత్రకుగాను దర్శక నిర్మాతలు తమన్నాను ఎంపికచేసిన సంగతి తెలిసిందే.
Related image
వచ్చే వారం జరగనున్న షూటింగ్లో తమన్నా తన తాలూకు షూటింగ్లో పాల్గొననుంది.  హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ షూట్ జరగనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు రామ్ చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: