విశాల్ పేరుకు తమిళ్ హీరో అయినా ఇతను పక్కా తెలుగు వాడు. ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉండే తమిళ్ నాడు లో మనోడు హీరోగా నిలదొక్కుకొని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. మొదట్లో అపవిజయాలు పలకరించిన తరువాత వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని విజయాలను స్వంతం చేసుకుంటున్నాడు. అయితే ఈ మద్యే వచ్చిన అభిమాన్యుడు తెలుగు లొ కూడా ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నది.
అయితే ఈ సినిమా లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవడం ద్వారా హిట్ సులభం అయిపోయింది. ఇప్పడూ కూడా విశాల్ అదే ఫార్ములా ను అమలుచేయబోతున్నాడు. తన మార్కెట్కి సమంత రేంజ్ హీరోయిన్ అంటే కాస్ట్లీ వ్యవహారమే అయినా కానీ విశాల్ ఆమెకి భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నాడు. ఆ స్ట్రాటజీ బాగా కలిసి వచ్చింది. తన తదుపరి చిత్రంలోను ప్రస్తుతం స్టార్గా వెలుగుతోన్న 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ని పెట్టుకున్నాడు.
పందెంకోడి సీక్వెల్లో కీర్తి సురేష్తో రొమాన్స్ చేస్తోన్న విశాల్కి అప్పుడే తెలుగు నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఈ చిత్రం హక్కులని ఠాగూర్ మధు సొంతం చేసుకున్నాడు. పందెంకోడి చిత్రంతోనే హీరోగా బ్రేక్ సాధించిన విశాల్ ఇప్పుడా సినిమా సీక్వెల్తో మరోసారి మాస్ హీరోగా సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. హీరోయిన్స్ క్రేజ్ ను వాడుకుంటూ హిట్స్ కొడుతున్న విశాల్ వ్యూహాలకు అందరూ ఫిదా అయిపోతున్నారు. చూడాలి ఇదే ఫార్ములా ను మిగతా హీరోలు ఫాలో అవుతారేమో...!