ఆ మద్య కర్ణాటక ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠత సృష్టించి ఎట్టకేలకు కాంగ్రెస్ పొత్తుతో సీఎం పీఠం ఎక్కారు కుమార స్వామి. గతంలో ప్రధాని హోదాలో ఉన్న దేవేగౌడ తనయుడు కుమార స్వామి. అయితే రాజకీయ నేపథ్యంలో ఉన్న వారి కుటుంబం ఇప్పుడు సినీ నేపథ్యంలో కూడా మంచి ఫామ్ లో కొనసాగుతుంది. గతంలో కుమార స్వామి తనయుడు ‘జాగ్వార్’సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేక పోయింది.
తాజాగా సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి సిని నటిగా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది..అప్పడే ఆమె చేతిలో నాలుగు సినిమాలు వున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్ట్, రాజేంద్ర పొన్నప్ప, భైరదేవి, నిమగగి అనే పేరున్న సినిమాల్లో రాధికా కుమార స్వామి నటించనుందని సమాచారం.
భైరదేవి చిత్రంలో రమేష్ అరవింద్ నటిస్తుండగా, కాంట్రాక్ట్లో అర్జున్ నటిస్తున్నాడు. కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి, ప్రముఖ నటి రాధికా కుమార స్వామి మళ్లీ సినిమాల్లో కనిపించనున్నారు.
2015 తరువాత దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న రాధికా చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలు ఉన్నాయి. భర్త ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయనకు చేదో వాదోడుగా ఉంటూనే..సినిమాలపై దృష్టి సారించడానికి సిద్దమయ్యారు రాధికా కుమార స్వామి. వీరికి ఒక పాప కూడా ఉంది. మరి కన్నడ నాట యువ హీరోయిన్లతో సీఎం సతీమణి ఎలా పోటీగా నిలుస్తుందో వేచి చూడాలి.