ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ లీస్ట్ లో చేరిపోయారు..బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్, అందాల భామ దీపికా పదుకొనె. ఈ జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే..అంతే కాదు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వాస్తవానికి వీరిద్దరి వివాహం ‘పద్మావత్’ సినిమా రిలీజ్ టైమ్ లోనే కావాల్సి ఉన్నా..ఆ సినిమా పై వచ్చిన విమర్శలు..గొడవలతో పెండింగ్ పడింది. అన్ని అవాంతరాలు దాటి సినిమా విడుదల కావడం..సూపర్ హిట్ కావడం కూడా జరిగింది.
తాజాగా పదుకోన్, రణ్వీర్ సింగ్ తమ పెళ్లి తేదీని ట్విటర్ వేదికగా ప్రకటించేసింది. ఇద్దరూ నాలుగు నిమిషాల వ్యవధిలో తమ పెళ్లి తేదీలను ప్రకటిస్తూ ట్వీట్లు చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో తమ పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు. కొన్నేళ్లుగా వీళ్లద్దరూ డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ మద్య దీపికా పదుకొనె ఇంట పెళ్లి సందడి కూడా మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లికి కావాల్సిన షాపింగ్ కూడా చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పెళ్లి తర్వాత ఉండాల్సిన ఇంటిని కూడా తమ అభిరుచికి తగినట్లు వీళ్లు మలచుకున్నారు.
అయినా వీళ్లు మాత్రం ఎప్పుడూ తమ పెళ్లి విషయంలో బయటపడలేదు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దీపికా తన రిలేషన్షిప్పై ఓపెన్ అయింది. ఈ జంట నటించిన సినిమాలు దాదాపు అన్ని హిట్ గానే నిలిచాయి. దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని బాలీవుడ్ టాక్. రామ్లీలా, బాజీరావ్ మస్తానీ మూవీల్లో ఈ జంట చూడముచ్చటగా ఉంది.
ఇక పద్మావత్లోనూ ఈ ఇద్దరూ కనిపించినా.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించలేదు. రణ్వీర్ ఖిల్జీగా, దీపికా రాణి పద్మిణిగా నటించిన విషయం తెలిసిందే. రణ్ వీర్ సింగ్ విలన్ గా కనిపిస్తాడు..షాహిత్ కపూర్ హీరోగా కనిపిస్తాడు. అయితే ఖిల్జీ, పద్మిణికి మద్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని..తమ రాజ్ పూత్ వంశీయులను అవమానించేలా సినిమా తీశారని కర్ణిసేన పెద్ద ఎత్తున గొడవ చేశారు..కానీ సినిమాలో ఆ సన్నివేశాలు లేకపోవడంతో..సినిమాపై ప్రశంసలు కురిపించారు.