శ్రియ సోగ కనుల సొగసులాడి. మూడు పదుల వయసులో కూడా మురిపించే ముద్దు గుమ్మ. ఆమె నడిచి వస్తూంటే అందాల శిల్పం అలా కదలి వస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె నవ్వులో పండు వెన్నెలలో కురుస్తాయి. పెళ్ళి అయినా కూడా ఇప్పటికీ కుర్ర కారు మీద ఎంత కక్షో కానీ కవ్విస్తూనే ఉంది. అంటువంటి సౌందర్య గని శ్రియ అన్ని ముచ్చట్లూ చెబుతోంది కానీ ఆ ఒక్కటీ అడక్కు అంటోంది.
లేటెస్ట్ గా శ్రియ నటించిన మూవీ ఒకటి రిలీజు అవుతోంది. వీర భోగ వసంత రాయలు ఆ సినిమా పేరు. అందులో శ్రియ కీలకమైన పాత్ర పొషిస్తోంది. . ఈ మూవీలో శ్రియతో పాటు నారా రోహిత్, శ్రి విష్ణు వంటి ఇతర నటులు ఉన్నారు. ఈ మూవీపై శ్రియ చాలా ఆశలు పెట్టుకుంది. మళ్ళీ తన దశ తిరుగుతుందని భావిస్తోంది.
ఇదిలా ఉండగా శ్రియను మీడియా ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేసిందట. పనిలో పనిగా మీ పర్సనల్ విషయాలు చెప్పండని అడిగిందంట. అంతే శ్రియా ఉగ్ర రూపం దాల్చేశారు. నా పర్సనల్ ఎందుకు, అవి మీతో పంచుకోను, దయచేసి ఆ ఒక్కటి అడగొద్దు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసిందట. శ్రియ కోపాన్ని చూసిన మీడియాకు ఏం పాలుపోలేదట.
ఇంతకీ శ్రియకు అంత ఆవేశం రావడానికి కారణం ఏంటో. ఆమె రష్యన్ వ్యక్తిని లవ్ మారేజ్ చేసుకుంది. ఆమె కాపురం బాగానే ఉంది. అయితే ఆమె వ్యక్తిగతం గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ చెప్పను అంటే మాత్రం అడిగే అధికారం ఎవరికీ లేదు. ఏదేమైనా అందాల శ్రియ ఇలా శివాలెత్తడం మీడియాకు కొత్తగానే ఉంది మరి.