టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ అంటే వెంటనే చెబుతారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. యాక్షన్, ఎమోషన్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా ఇది రూపొందనుంది. ఈ సినిమా కూడా నాన్న సెంటిమెంట్ తోనే ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి నాన్న గొప్పతనం ఏంటో ఓ కొడుకు చాటి చెప్పిన సినిమా.
‘నా పేరు సూర్య’సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్నాడు అల్లు అర్జున్. వాస్తవానిక ఆ మద్య విక్రమ్ కుమార్ తో ఓ సినిమా అనుకున్నప్పటికీ సరైన కథ అందించడంలో విఫలమయ్యారని టాక్ వచ్చింది. దాంతో అల్లు అర్జున్ మరోసారి త్రిక్రమ్ తోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివ్రిక్రమ్ కథ వినిపించడం బన్నీ ఓకే చెప్పేయడం జరిగిందట. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేస్తారట.
ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం ఇప్పటికే సత్యరాజ్, మాలీవుడ్ నటుడు జయరామ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేష్ లను తీసుకున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ తల్లి పాత్ర కోసం అలనాటి అందాల తార టబుని సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ ఇలాంటి పాత్రల కోసం నదియా, ఖుష్బూలను తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు టబు ని రంగంలోకి దింపుతున్నడన్నమాట.