బ్యూటీ ఉంటే బుద్ధి ఉండదంటారు. కొందరికీ బ్యూటీ, బుధ్ధి రెండూ ఉంటాయి. మరి కొందరికి లేట్ గా బ్యూటీ పక్కన బుద్ధి కూడా వచ్చి చేరుతుంది. అందాల బొమ్మలకు ఆలోచన కంటే ఆత్రుత ఎక్కువ. దాంతో తప్పుల మీద తప్పులు చేస్తారు. ఆ మీదట బుద్ధి వచ్చి చింతిస్తారు. ఇపుడు పూజా హెగ్డే పరిస్థితి కూడా అలాగే ఉంది మరి.


ఈ అమ్మడు తెలుగులో ముకుంద మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ పర్వాలేదనిపించుకుంది. అయితే వరసగా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చేశాయి. కానీ బాలీవుడ్ పై మోజు పెంచుకుని వాటికి నో చెప్పేసింది. అక్కడ మొహంజదారో మూవీని చేసేందుకు రెండేళ్ళు విలువైన సమయం ఖర్చు చేసేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ చీదేసింది. దాంతో పూజ ఆశలు ఒక్కసారిగా  నీరుకారిపోయాయి.


దెబ్బకు అమ్మడు ఇపుడు దిగివచ్చిందట. తనకు ఎంతో అవకాశం ఇచ్చి లిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ నె అనవసరంగా వదిలేసుకున్నానని తెగ  బాధ పడుతోందంట. తాను టైం విలువ తెలుసుకున్నానని, ఇకపై ఒక్క ఆఫర్ కూడా వదులుకోనని, టాలీవుడ్లోనే తన పయనం అంటోంది ఈ ముద్దు గుమ్మ. చేతిలో ఇపుడు రెండు సినిమాలు పెద్దవే ఉన్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు మహర్షి. రెండవది తొందరలో ప్రారంభం అయ్యే ప్రభాస్ మూవీ. ఈ సినిమాల తరువాత మరింత ఎక్కువగా చాన్సులు వస్తాయని నమ్ముతోంది పూజా. 


మరింత సమాచారం తెలుసుకోండి: