సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ ల్యాండ్ మార్క్ మూవీగా 25వ సినిమాగా వచ్చిన మహర్షి ఇప్పుడు రికార్డుల పని పడుతుంది. సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. మొదటి రోజు 30 కోట్ల పైగా షేర్ రాబట్టిన మహర్షి రెండో రోజు ఆ దూకుడు కొనసాగిస్తున్నాడు. 


ఇక ఈ సినిమా వసూళ్ల హంగామా చూస్తే మహేష్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అయ్యేలా ఉంది. మహేష్ మహర్షి రెండవ రోజు కూడా కలక్షన్స్ జోరు కొనసాగించాడు. రెండో రోజు ఏప్, తెలంగాణాలో 15 కోట్ల పైగా షేర్ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా రెండు రోజుల్లో 70 కోట్ల దాకా గ్రాస్.. 45 కోట్ల షేర్ రాబట్టాడు మహర్షి. చూస్తుంటే మహేష్ బాబు నాన్ బాహుబలి రికార్డులను సైతం కొల్లగొట్టేలా ఉన్నాడు.


ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ లో రెండో రోజు మహేష్ మహర్షి 74 లక్షల కలక్షన్స్ సాధించాడు. నాన్ బాహుబలి రికార్డ్ సాధించిన రంగస్థలం అక్కడ రెండవ రోజు 69 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ లెక్కన మహర్షి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. గురువారం ఎలాగు అన్నిచోట్ల హౌజ్ ఫుల్ కాగా శుక్రవారం కూడా ఆక్యుపెన్సీ బాగుందని తెలుస్తుంది.


శని, ఆదివారాలు ఎలాగు వీకెండ్ కాబట్టి ఇక తిరుగు ఉండదు. మొత్తంగా మహర్షి కలక్షన్ల సునామి మొదలైంది. రిలీజ్ ముందు ఎంత కాన్ ఫిడెంట్ గా చెప్పారో రిలీజ్ తర్వాత వస్తున్న వసూళ్లను చూసి చిత్రయూనిట్ మరింత జోష్ ఫుల్ గా ఉంది. శుక్రవారం చిత్ర దర్శక నిర్మాతలు సక్సెస్ కేక్ కట్ చేసి ప్రెస్ తో మాట్లాడారు. దిల్ రాజు ఆఫీస్ దగ్గర బాంబులను కూడా కాల్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: