సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వచ్చిన మూవీ మహర్షి. భారీ బడ్జెట్ తో ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. మహేష్ మహర్షి సమ్మర్ పర్ఫెక్ట్ హిట్ అంటూ సినిమాను ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాదు సినిమాలో మెసేజ్ కూడా అందరిని టచ్ చేసింది.


తన ల్యాండ్ మార్క్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నాడో అదేవిధంగా వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తీశాడు. మహేష్ బాబు 3 వేరియేషన్స్ లో అదరగొట్టాడు. అయితే ఈ సినిమా రన్ టైం ఎక్కువ ఉన్నా సరే నెట్టుకొచ్చేశారు. సినిమా లెంగ్త్ ఎక్కువ ఉన్నా కంటెంట్ కు కనెక్ట్ అవడం వల్ల సినిమా సక్సెస్ అయ్యింది.


అయితే అసలే రన్ టైం కాస్త ఎక్కువ అన్న టాక్ ఓ పక్క ఉండగా ఇప్పుడు మహర్షిలో మరో రెండు మూడు సీన్స్ కలిపే ఆలోచన చేస్తున్నారట మహర్షి టీం. రిషి పూజా ఇంటికెళ్తే అక్కడ పెళ్లిచూపులు సీన్ పెట్టారు కదా అక్కడ ఇంకాస్త కామెడీ ఉంటుందట. దానితో పాటుగా సెకండ్ హాఫ్ లో మహేష్, నరేష్, రైతుల మధ్య ఓ సీన్ ఉంటుందట.  


మరి ఈ రెండు సీన్స్ యాడ్ చేస్తే ఎలా లేదన్నా మరో 10, 15 నిమిషాలు రన్ టైం పెరుగుతుంది. సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ కోసం ఈ సీన్స్ యాడ్ చేయడం ఓకే కాని మొదటిసారి చూసే వాళ్ల పరిస్థితి కూడా ఆలోచించాలి.. ఎక్కడ అతను హెడేక్ గా ఫీల్ అయినా సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లమీఅక్స్ ను ఇబ్బందిగా భావిస్తాడు. ఎలాగు డిలీటెడ్ సీన్స్ యూట్యూబ్ లో పెడతారు కాబట్టి అందులో కాని లేదా డిజిటల్, శాటిలైట్ మూవీలో కాని అవి చేర్చితే బెటర్.  



మరింత సమాచారం తెలుసుకోండి: