చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ రికార్డులు బ‌ద్దల‌య్యాయి. షారుఖ్‌ఖాన్‌,దీపికా ప‌దుకొనె జంట‌గా న‌టించిన చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ క‌లెక్షన్స్‌ మూడు వంద‌ల కోట్ల మార్కును చేరుకోగ‌లిగింది. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా 3500 స్క్రీన్స్‌లో రిలీజ్ కాగ‌, దాదాపు 700 పైగా స్క్రీన్స్ విదేశాల‌లో రిలీజ్ అయి, మూడు రోజుల‌కే  వంద కోట్లు సంపాదించి రికార్డును క్రియోట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును మ‌రో బాలీవుడ్ మూవీ బ‌ద్దలు చేసింది. ఇది క‌లెక్షన్స్ ప‌రంగా కాదు. ర‌ణ్‌భీర్ క‌పూర్ అప్ క‌మింగ్ ఫిల్మ్ భేష‌ర‌మ్ మూవీను ప్రపంచ‌వ్యాప్తంగా  4500  స్క్రీన్స్ లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కూ భార‌త సినీ చ‌రిత్రలో ఇన్ని థియోట‌ర్లలో రిలీజ్ అయి మూవీల‌లో ఇదే మొట్ట మొద‌టిది. అక్టోబ‌ర్ 2న ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంది.

ఇండియాలో 3600 థియోట‌ర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డిస్ట్రి బ్యూష‌న్‌ని రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్ తీసుకుంది. దీనికి సంబంధించిన అఫిష‌య‌ల్ స్టేట్‌మెంట్‌ను రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్ డిస్ట్రిబ్యూష‌న్ హెడ్ ఆచార్య అధికారికంగా వెల్లడించాడు. 'భేష‌ర‌మ్ మూవీనే ఇప్పటి వ‌ర‌కూ హైయ‌స్ట్  స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న మొద‌టి మూవీ. నిజానికి ఈ మూవీను ఇండియాలో 4000 థియోట‌ర్లలో రిలీజ్‌కు ఫ్లానింగ్ చేసుకున్నాము. కాని సెప్టెంబ‌ర్ 27న టాలీవుడ్ హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూవీ అత్తారింటికిదారేది రిలీజ్ కావ‌డంతో ఆంద్రప్రదేశ్‌,త‌మిళ‌నాడు,క‌ర్ణాట‌కలో దాదాపు 400 వంద‌ల థియోట‌ర్లను వ‌దులుకోవ‌ల‌సి వ‌చ్చింది. మూవీ క‌లెక్షన్స్‌లోనూ భేష‌ర‌మ్‌ మూవీ రికార్డును క్రియోట్ చేస్తుందని' వివ‌రించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: