రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా మంచి పేరుంది. డి.ఎస్.పి గనక ఆల్బం ఇచ్చాడంటే సినిమా సగం హిట్టని దర్శక, నిర్మాతలతో పాటు ప్రేక్షకులు ఫిక్సైపోవాల్సిందే. అది దేవీ టాలెంట్. తనకున్న బ్రాండ్ ఇమేజ్. కుర్ర హీరోల దగ్గర్నుండి స్టార్స్ వరకు దేవీ సంగీతమందించని సినిమాలేదు. కొత్త పాత దర్శకులు అనే భావమూ దేవీలో లేదు. అందుకే దేవీకి ఇండస్ట్రీలో అంత క్రేజ్ ఏర్పడింది. అయితే గత కొంత కాలంగా దేవీ మంచి ట్యూన్స్ ఇవ్వడం లేదని అందరు అనుకుంటున్న మాట.
ఈ మాట కూడా వాస్తవమేనని దేవీ రీసెంట్ సినిమాలు చెబుతున్నాయి. రిపీటెడ్ ట్యూన్స్ ఇస్తున్నాడని, సాంగ్స్ లో ముందున్నంత డెప్త్ ఉండటం లేదని కూడా ఫిలిం నగర్లో వినిపిస్తున్న మాట. వాస్తవంగా దేవీ మ్యూజిక్ అందించిన దాదాపు అన్నీ సినిమాలకు ఆడియో ఫంక్షన్స్ లో తన ట్రూప్ తో ప్రమోషన్స్ కూడా చేస్తాడు. అది కూడా సినిమా హిట్ కి ఒకరకంగా దోహద పడుతుంది. అయితే రీసెంట్గా వాల్మీకి సినిమా నుండి దేవీ తప్పుకున్నట్టుగా వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు.
తమిళ సూపర్ హిట్ 'జిగర్తాండ'కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు దేవీ స్థానంలో మిక్కీ జే మేయర్ను తీసుకున్నారట. మరి ఇప్పటికైన వాల్మీకి టీం ఈ వార్తలపై స్పందిస్తుందో లేదో చూడాలి.