సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ సినిమా సరిలేరు నీకెవ్వరూ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ బాబు, తిరిగిరాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అయితే అంతకుముందే సినిమా షూటింగ్ ని ప్రారంభించనుంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గీత గోవిందం భామ రష్మిక హీరోయిన్ కావడం, వరుస విజయాలతో దూసుకెళ్తున్న మహేష్, అనిల్ రావిపూడి కలిసి ఈ సినిమా చేస్తుండడం, 

అలానే వరుసగా మూడోసారి దేవిశ్రీప్రసాద్ మహేష్ సినిమాకు పనిచేయడం, మరీ ముఖ్యంగా ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయశాంతి గారు మళ్ళి ఈ సినిమా ద్వారా రి ఎంట్రీ ఇస్తుండడం వంటివి. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందని, నిజానికి సినిమాలో ఇదే కీలకమైన క్యారెక్టర్ అని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు, అంతేకాదు ఈ కీలకమైన క్యారెక్టర్ కోసం ఇదివరకు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ నటిస్తున్నట్లు నేడు ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో షికారు చేస్తోంది. 

ఇప్పటివరకు మహేష్ వంటి బడా  సూపర్ స్టార్ తో పనిచేయని మెహ్రీన్, ఆ క్యారెక్టర్ గురించి దర్శకుడు అనిల్ చెప్పగానే వెంటనే ఒప్పుకుందట. ఎప్పటినుండో తాను మహేష్ ప్రక్కన నటించాలని అనుకుంటున్నానని, అయితే అది ఈ విధంగా రావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని మెహ్రీన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. అసలు ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియడం లేదుగాని, ఒకవేళ నిజం అయితే మాత్రం మెహ్రీన్ కెరీర్ పరంగా మంచి అవకాశాన్ని అందుకుంది అని చెప్పవచ్చు...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: