పవన్ కళ్యాణ్ని మళ్ళీ సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ ఆశ. అయితే పవన్ రెండేళ్ళుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇపుడు మాత్రం పవన్ ఒక గట్టి డెసిషన్ తీసుకున్నారట. పవన్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఏది ఏమైనా ఆయన మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతారట. పవన్ కళ్యాణ్ ఇపుడు రెండు పడవల మీద కాలు వేస్తున్నారు. ఒక వైపు రాజకీయాల్లో బిజీ కావాలని అనుకుంటున్నారు.


మరో వైపు సినిమా రంగాన్ని కూడా వీడనంటున్నారు. మరి ఈ రెండింటికీ బ్యాలన్స్ ఎలా అన్నది పవర్ స్టార్ నిర్ణయించుకుంటారన్నది త్వరలోనే తెలుస్తోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ముఖానికి రంగేసుకోకుండానే సినిమా రంగంలో అనుబంధం కొనసాగించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఆ బ్యానర్‌పై ఇకపై సినిమాలను నిర్మించి.. నిర్మాణ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


పవన్ కళ్యాణ్ తన మిత్రుడైన త్రివిక్రమ్‌ను.. రామ్ చరణ్ కోసం మంచి కథను సిద్ధం చేయమన్నట్లు సమాచారం. 2020లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందని ఇండస్ట్రీ టాక్. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉండ‌గా, త్రివిక్ర‌మ్.. బ‌న్నీ 19వ‌చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.


తన ఫ్యామిలీ హీరోలతో కాదు కొత్త టాలెంట్‌తో కూడా సినిమాలు నిర్మించాలనేది జనసేనాని ప్లాన్. కొంత గ్యాప్ తీసుకుని.. నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ సెట్ చేస్తాడట. ఆ విధంగా పవన్ కళ్యాణ్‌కి ఆదాయం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీతోనూ టచ్ పోదు. అందుకే ఈ ప్లాన్. మొత్తానికి పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ ప్లే చేయడానికి డిసైడ్ అయ్యారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: