టాలీవుడ్ లో ప్రస్తుతం కెరీర్ పరంగా కొంత ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటూ సతమతం అవుతున్న హీరోల్లో యంగ్ హీరో నితిన్ ఒకరు. 2016లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమా హిట్ కొట్టిన తరువాత అయన చేసిన లై, చల్ మోహన రంగ సినిమాలు మంచి హైప్ తో విడుదలైనప్పటికీ అవి అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇక అప్పటినుండి తన కెరీర్ ప్రరంగా ఇకపై జాగ్రత్తగా ముందుకెళ్లాలని ప్లాన్ చేసిన నితిన్, నిన్న చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమాను మొదలెట్టిన విషయం తెలిసిందే. 

'సింగల్ ఫర్ ఎవర్' అనే ట్యాగ్ లైన్ తో ఒక కొత్త తరహా కథగా రూపొందుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక 'చలో' తరహాలోనే ఈ సినిమా కూడా మంచి ఎటెర్టైనింగ్ గా సాగుతుందని, అలానే ఈ సినిమాతో నితిన్ మంచి హిట్ కొట్టడం ఖాయమని సమాచారం. ఇక ఒక ప్రక్క ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, కాసేపటి క్రితం తాను చేయబోయే మరొక సినిమాను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అనౌన్స్ చేసాడు నితిన్. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, అఖిల్ తో మిస్టర్ మజ్ను వంటి లవ్ స్టోరీస్ ని తీసి మంచి సక్సెస్ లు అందుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. 

తొలిసారి నితిన్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది యంగ్ బ్యూటీ కీర్తి సురేష్. ఇక సూపర్ సినిమాటోగ్రాఫర్ గా పేరుగాంచిన పిసి శ్రీరామ్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాను పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. 'గిమ్మీ సమ్ లవ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందబోతున్న ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని అంటున్నారు. ఇక ఈ విధంగా పవన కళ్యాణ్ కు వీరాభిమాని అయిన నితిన్, ఒకేసారి ఇద్దరు వెంకీల సినిమాలను లైన్లో పెట్టడం జరిగింది. మరి ఈ రెండు సినిమాలతో నితిన్ ఎంతవరకు విజయాలు అందుకుంటాడో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: