సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుని దూసుకుపోతున్నారు. ఇక త్వరలో అయన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ గా సాగుతుందని, మహేష్ గారు చాలా రోజుల తరువాత మంచి యాక్షన్ కం కామెడీ రోల్ లో నటిస్తున్నారని ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పారు. ఇకపోతే ఇండస్ట్రీలో కొందరు హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా లక్కీ హ్యాండ్ అనే పేరుంది. 

నిజానికి అయన ఆడియో ఫంక్షన్స్ కు వెళ్లిన కొన్ని సినిమాలు మంచి విజయవంతం అయ్యాయి. అందువలన ఎవరిదైనా సినిమా ఫంక్షన్ కు మహేష్ వస్తే ఆ సినిమా హిట్ అవుతుందని పలువురు భావిస్తుంటారు. అంతేకాదు అయన బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి పరిచయం చేసిన కొందరు హీరోయిన్లు ప్రస్తుతం అక్కడ మంచి పొజిషన్ లో కొనసాగుతున్నారు. అయితే ఆ విధంగా ఆయన సరసన వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్, తెలుగులో ఆ సినిమా ఆడనప్పటికీ ఆపై మెల్లగా బాలీవుడ్ అవకాశాలు చేజిక్కించుకుని ప్రస్తుతం అక్కడ క్రేజీ హీరోయిన్లలో ఒకరుగా మారింది. ఇకపోతే ఇటీవల భరత్ అనే నేను ద్వారా అయన టాలీవుడ్ కి పరిచయం చేసిన కియారా అద్వానీ కూడా ఇటీవల కబీర్ సింగ్ సూపర్ హిట్ తో బాలీవుడ్ లో మంచి పేరుతో దూసుకుపోతోంది. 

అయితే మహేష్ కొందరు ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా నటించారు. వారిలో రాజకుమారుడుతో ప్రీతీ జింత ప్రక్కన జతకట్టగా, వంశీలో ఆయనతో నటించిన నమ్రత ఏకంగా ఆయనకు జీవిత భాగస్వమి అయ్యారు. ఇక టక్కరిదొంగలో నటించిన బిపాషా అక్కడ మంచి హీరోయిన్ గా నిలబడగా, లిసారే కూడా పర్వాలేదనిపించింది. అంతేకాదు నాని సినిమాలో అమీషా పటేల్ ప్రక్కన, అలానే మురారిలో సోనాలి బింద్రే ప్రక్కన అయన జోడి కట్టడం జరిగింది. అయితే వారిలో ప్రీతీ, సోనాలి అప్పటికే మంచి పేరున్న హీరోయిన్స్ కాగా, అమీషా పటేల్ కూడా అక్కడక్కడా కొన్ని బాలీవుడ్ హిట్ సినిమాల్లో మెరిసింది. మరి ఈ విధంగా చూసుకుంటే కూడా మహేష్ ది గోల్డెన్ హ్యాండే అంటున్నారు సినీ విశ్లేషకులు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: