వరుస మూవీలతో బిజి అవుతున్న శృతిహాసన్కి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి అని కొన్ని లీడింగ్ టాబ్లాయిడ్స్లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో శృతి హాసన్కి ఏమైందని అందరూ కంగారు పడుతున్నారు. అసలు మేటర్ను తెలుసుకుంటే అంత కంగారు పడాల్సిన విషయం కాదని తెలిసింది. శృతిహాసన్ ఈ మధ్య కాలంలో తను నటించిన ప్రతి ఫిల్మ్ సక్సెస్ బాట పడుతుంది. దీంతో శృతికి ఫిల్మ్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరుగుతుంది.
ఆఫర్లు కూడ వరుస పెట్టి వస్తున్నాయి. వస్తున్న ప్రతి ఆఫర్స్లో ఏది మంచిదో సెలక్ట్ చేసుకొని, తన షెడ్యూల్స్ని ఖాళీ లేకుండా చూసుకుంటుంది. దీని వల్ల శృతిహాసన్కు మినిమం రెస్ట్ కూడ కరువయ్యింది. ఈ విషయాన్ని తల్లి సారిక గమనించింది. గబ్బర్సింగ్ మూవీ నుండి శృతి హాసన్ కనీసం రెండు రోజుల విశ్రాంతి కూడ తీసుకోలేదట. గబ్బర్సింగ్,డిడే, రామయ్యావస్తావయ్యా (హింది), రామయ్యవస్తావయ్యా (ఎన్టీఆర్), ఇలా వరుస మూవీ షూటింగ్లతోనూ, వాటి ప్రమోషన్ ఈవెంట్స్తోనూ బిజిబిజిగా గడుపుతుంది.
ఏదైన షెడ్యూల్ వారం రోజుల గ్యాప్ దొరికితే, ఆ సమయంలో ఎడ్వెర్టైజింగ్ బ్రాండ్స్కు సంబంధించిన షూటింగ్స్లో పార్టిసిపెట్ చేస్తుంది. గత సంవత్సర కాలంగా కూతురి డే షెడ్యూల్స్ను చూసిన సారిక ఓ సలహా ఇచ్చింది. 'నీ కొత్త మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు కనీసం పది రోజుల రెస్ట్ తీసుకొని షూటింగ్స్తో పార్టిసిపెట్ చేయి' అని గట్టిగా చెప్పిందట. దీంతో తల్లి సారిక చెప్పిన సలహాను వినటానికి శృతి హాసన్ రెడీ అయిందని సమాచారం.