గత సంవత్సరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన సినీ క్రిటిక్ 'కత్తి మహేష్' మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్య చేసి వార్తల్లో నిలుస్తుంటారు మన కత్తి గారు. గతంలో శ్రీ రెడ్డికి మద్దతుగా నిలిచి పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై విరుచుకుపడేలా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు కత్తి మహేష్. 


ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని కథయకుడిగా, నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలుగా పూరి జగన్నాథ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి, ఛార్మి కలిసి ఈ సినిమాను  తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అయ్యి అందరిని ఆకట్టుకుంది. మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా రూపొందింది. పిల్లి గుడ్డిదైతే ఎలుకు ఎగిరెగిరి చూపించిందట.. నీ జాతినా పుల్లా'.. ఈ డైలాగ్ ప్రతి మాస్ ప్రేక్షకుడికి ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.


ఫుల్ మాస్ వాయిస్ తో హీరో రామ్ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి నటించాడు. అందరూ ట్రైలర్ అదిరింది అని చెప్పే సమయంలో సినీ క్రిటిక్ కత్తి మహేష్ కత్తి దూశాడు. కత్తి మహేష్ ఫేసుబుక్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాపై స్పందిస్తూ ''ఇష్మాట్ శంకర్' ట్రైలర్ చూసాను. గోలగొలగా ఉంది. పూరీ గారు బీట్ మిస్సయ్యారో లేక కొత్త బీట్ లోకి వచ్చారో సినిమా చూసాక తెలుస్తుంది'' అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలం హిట్ లేక విలవిల్లాడుతున్న రామ్, పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: