మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తాను హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ ని పూర్తి చేసారు. ప్రస్తుతం డబ్బింగ్ సహా ఇతర నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కనుకాగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమా తరువాత అయన తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో నటించే సినిమా కోసం ఇప్పటినుండే తన శరీర బరువుని తగ్గించుకునే పనిలో పడ్డారు మెగాస్టార్. 

ఫ్యాన్స్ తో పాటు యువతను కూడా ఆకట్టుకునేలా మెగాస్టార్ ఇందులో దర్శనం ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకోసమే అయన ఇటీవల విశాఖపట్నంలోని ఒక స్పాలో కొద్దిరోజులపాటు గడిపినట్లు చెప్తున్నారు. ఆకట్టుకునే మంచి కథ, కథనాలతోపాటు మెగాఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండనున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలతో పాటు ఒక మంచి మెసేజి కూడా ఈ సినిమాలో ఉండనుందట. కేవలం మెగాస్టార్ కోసమే కొరటాల రాసుకున్న ఈ క్యారెక్టర్, ఇప్పటివరకు తాను తీసిన సినిమాలన్నింటిలోకి ది బెస్ట్ అని తన సన్నిహితులతో కొరటాల చెప్పినట్లు సమాచారం. 

ఇకపోతే ఇప్పటివరకు తన సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ వస్తున్న దేవిశ్రీప్రసాద్ నే ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా తీసుకుకోనున్నారట. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్, ఇతర తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతిత్వరలో జరుగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో వెల్లడించనున్నారట. మరి తొలిసారి మెగాస్టార్ ని దర్శకత్వం వహిస్తున్న కొరటాల ఎటువంటి సినిమాను ఆయనకు అందిస్తారో వేచిచూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: