టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తనతో కలిసి గతంలో డీజే వంటి సక్సెఫుల్ సినిమాలో హీరోయిన్  గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో కలసి జోడి కడుతోంది. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోలను ఎంకరేజ్ చేసే స్టార్స్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు అనే చెప్పాలి. 

ఇటీవల కూడా కొందరు చిన్న హీరోల సినిమాలపై ఆయన తనవంతుగా పాజిటివ్ గా స్పందించి వారి సక్సెస్ ని అభినందించడం జరిగింది. అలానే అప్పుడప్పుడు ఆయన కొన్ని చిన్న సినిమాల ఆడియో ఫంకన్స్ కి కూడా అటెండ్ అవుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త సినిమా రణరంగం. 90వ దశకంలో జరిగిన గ్యాంగ్ స్టార్ స్టోరీ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఆ సినిమా నిర్మాతలు కాకినాడలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అంతేకాక ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ప్రత్యేక అథితిగా ఆహ్వానించాలని వారు భావిస్తున్నారట. ఈ విషయమై నేడో, రేపో ఆయనను కలిసి నిర్మాతలు మాట్లాడే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం కొన్ని మీడియా మాధ్యమాల్లో పుకారవుతున్న ఈ న్యూస్ పై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఒకవేళ ఆ సినిమా నిర్మాతలు ఆహ్వానిస్తే బన్నీ తప్పకుండా వస్తారని అంటున్నారు అయన ఫ్యాన్స్. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: