యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతూ, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు వీడియో సాంగ్ టీజర్లు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయనే చెప్పాలి. 

అయితే ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో కామెడీ మరియు సాంగ్స్ ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా ఉంటాయా అనేది కొంత సందేహమే అంటూ పలువురు సహదేహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక టీజర్ ని బట్టి చూస్తే ఇది, పూర్తి స్థాయి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ మాదిరి కనపడుతోందని, అలానే విడుదలైన రెండు వీడియో సాంగ్ ప్రోమోలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలోని మిగతా సాంగ్స్ అయినా ఆడియన్స్ ని ఆకట్టుకునే రేంజ్ లో ఉంటాయా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

ఇక కామెడీ కూడా సినిమాలో పెద్దగా ఉండే అవకాశం లేదని, ఎందువలన అంటే, మనకి టీజర్ లో కేవలం వెన్నెల కిషోర్ ని మాత్రమే చూపించడం జరిగింది. దాన్నిబట్టి సినిమాలో కామెడీ కొంత తక్కువగా ఉండేట్లు కనపడుతోంది అనేది వారి వాదన. ఒకవేళ సినిమాలో ఆడియన్స్ ఆశించే రేంజ్ లో సాంగ్స్ మరియు కామెడీ లేనట్లయితే, అవి సినిమాకు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచారం అవుతున్న పుకార్లేనని, ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయి సాంగ్స్ మరియు ట్రైలర్ బయటకు వస్తేనేకాని, మనం సినిమాపై ఒక అంచనాకు రాలేమని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం సాహో రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: