టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుని, ఇటీవల ఆయన నుండి విడిపోయి తన పిల్లలతో కలిసి విడిగా ఉంటున్న నటి రేణు దేశాయ్, గత కొద్దిరోజులుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. గతంలో పవన్ తో కలిసి బద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె, వివాహం తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆమె త్వరలో ఒక సరికొత్త అవతారంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్దిరోజలుగా వార్తలు వస్తున్నాయి. 

ఇటీవల రాక్షసుడు సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందబోతున్న సినిమాకు ఆమె మాటల రచయితగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇటీవల ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర కూడా ఒక ప్రకటన చేసారు. అది మాత్రమే కాక, అదే సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ఆమెను తీసుకోవాలని యూనిట్ భావించిందట. అయితే తనకు నటిగా కొనసాగాలనే ఉద్దేశ్యం లేదని, కేవలం రచయితగానే వ్యవహరించాలని ఉందని వారి అఫర్ ని సున్నితంగా తిరస్కరించారట రేణు. వాస్తవానికి తనకు రైతులకు సంబంధించి ఒక మంచి సినిమాను నిర్మించాలని ఉందని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. 

ఇక ఆ సినిమాకు సంబంధించి ఆమె ఇప్పటికే పనులను ప్రారంభించారని, అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆమె ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం కూడా చేయాలని రేణు భావిస్తున్నారట. అయితే రాబోయే రోజుల్లో రేణు గారిని ఒక దర్శకురాలిగా చూడబోతున్నాం అన్నమాట. కాగా ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారికంగా ఆమె నుండి ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది.....!!       


మరింత సమాచారం తెలుసుకోండి: