కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత బారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా భాటియా, సుదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటి స్టంట్ మొదలు పెట్ట బోతున్నట్లు లేటెస్ట్ న్యూస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు బాహుబలి బిగినింగ్..బాహుబలి కన్‌క్లూజన్ తర్వాత మళ్ళీ అలాంటి భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడంతో సైరా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతోంది.

సైరా వంటి భారీ సినిమాకు నేషనల్ వైడ్ గా క్రేజ్ రావలంటే బాలీవుడ్ వైపు నుంచి పబ్లిసిటి స్టార్ట్ చేయాలి. అందుకే సాహో సినిమాకు ఫస్ట్ ఫంక్షన్ బాలీవుడ్ లో చేసారు. దీన్ని దృష్ఠిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమా పబ్లిసిటీని కూడా ముందు బాలీవుడ్ లో మొదలు పెట్టడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. అక్టోబర్ 2న సైరా విడుదల అని చిత్ర బృందం ఎప్పుడో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాబట్టి ఈనెల 14 నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ముందుగా 14న సైరా మేకింగ్ వీడియో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆ తరువాత ఈనెల 20న ముంబాయ్ లో భారీ ఫంక్షన్ చేయబోతున్నారు. అమితాబ్, విజయ్ సేతుపతి, మెగాస్టార్ చిరంజీవి తదితరులంతా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. అదే ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ కోసం అన్నీ భాషలకి సంబంధించిన సైరా టీజర్ విడదుల చేస్తారు.  

ఇదిలా ఉంటే సైరా టీజర్ రిలీజ్ చేసిన తరువాత రోజు అంటే ఆగస్ట్ 21 న విదేశాలకు బయలుదేరబోతున్నారని ఫ్రెష్ అప్‌డేట్. ఆగస్ట్ 22 న మెగాస్టార్ బర్త్ డే కాబట్టి తన కుటుంబ సభ్యుల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోబోతున్నారని తెలుస్తోంది. ఎప్పుడు ఫ్యాన్స్ మధ్యన  తన పుట్టిన రోజు వేడుకను జరుపుకునే మెగాస్టార్ ఈ సారి విదేశాలకు వెళుతుండటం విశేషం. ఇక మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం అద్భుతమైన కథను తయారు చేశారట కొరటాల. ఇప్పటివరకు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కొరటాల మెగాస్టార్ తో సినిమా తెరకెక్కించబోతుండటంతో ఈ సినిమా మీద ఈప్పటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: