టాలీవుడ్ లో స్టార్ హీరోల తనయుడు హీరోలుగా వస్తున్న సమయంలో నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ తనయుడు ఆది సాయి హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  మొదటి సినిమా పరవాలేదు అనిపించుకున్నా..తర్వాత వచ్చిన ఏ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఒకానొక దశలో ఆది సాయికుమార్ కెరీర్ కష్టాల్లో పడుతుందనుకున్న సమయంలో ‘బుర్రకథ’తో  మరోసారి తెలుగు ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్నారు.   ప్రస్తుతం ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' సినిమా రూపొందింది.

విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటి వరకు ఆది రొమాంటిక్ సినిమాల్లో చాలా తక్కువగా  నటించారు.  కుటుంబ కథా నేపథ్యంలోనే ఆది ఎక్కువగా నటించారు. ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్  చక్కటి ప్రేమ కథాచిత్రంగా రూపొందుతుందట.  'జోడి' సినిమా వచ్చేనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ఈ సినిమాలో ట్రైలర్ లో సీనియర్ నరేష్ ఎక్కువ జూదం, బెట్టింగ్ లాంటివి ఆడటం..ఆది హీరోయిన్ ప్రేమలో పడటం..ఆమె తల్లిదండ్రులు అడ్డు చెప్పడం..ఇది చూడటానికి రొటీన్ గా ఉన్న ఈ ట్రైలర్ లో అందమైన ప్రేమ, వ్యసనాలపై మెసేజ్ ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కూడా చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది.

ఈ కన్నడ బ్యూటీ తెలుగు లో మంచి హిట్ కోసం ప్రయత్నిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆది సాయికుమార్ కూడా తనకు ఓ మంచి హిట్ కావాలని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు గోల్డ్ ఫిష్ లో కూడా నటిస్తున్నాడు. . గొల్లపూడి మారుతీరావు .. సితార .. వెన్నెల కిషోర్ వంటి నటీనటులు, ఈ సినిమాకి ప్రధాన బలంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: