టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజే వేరు. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. దాదాపు చాలా సంవత్సరాల పాటు హిట్టు లేకుండా ఉన్నా కానీ ఎక్కడా కూడా పవన్ కెరియర్ కి డౌన్ ఫాల్ అనేది రాలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నా గాని ఇటీవల సినిమాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో పవన్ కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి దారుణంగా ఓడిపోవడం జరిగింది.


అయినా గాని పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కృంగిపోకుండా ప్రజా సమస్యల కోసం నిరంతరం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని ఓడిపోయిన తర్వాత ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కాస్త సినిమాలకు దూరంగా ఉన్నారు అన్న బాధ ప్రతి అభిమానుల్లో నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో మరికొద్ది గంటల్లో 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున చేయడానికి శ్రీకారం చుట్టారు.


ఇదే తరుణంలో వినాయకచవితి పండుగ రావడం సందర్భంగా రక్తదానం అన్నదానం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభిమానులు చేయాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులందరికీ తన పుట్టినరోజు నాడు ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నారని సమాచారం. అదేంటో కాదు తానూ మళ్ళీ సినిమాల్లో నటించనున్నాడని, అది కూడా అజ్ఞాతవాసి నిర్మాతైన రాధాకృష్ణ, తన హారిక హాసిని సంస్థ నిర్మాణంలో సినిమా చేయనున్నారని ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: