తెలుగు టెలివిజన్ పాఠకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3. తాజాగా ఇటీవల ఆదివారంతో ఏడవ వారం లోకి అడుగు పెట్టిన షోలో కి వైల్డ్ కార్డు రూపంలో ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. మంగళవారం నుండి తన గేమ్ స్టార్ట్ చేసింది. హౌస్ లో అడుగు పెట్టిన మొట్టమొదటి సందర్భంలో శిల్ప చక్రవర్తి ఈరోజే ఎంట్రీ ఇచ్చ మీరు ఆడుతున్న గేమ్ అంతా ఎలా ఉందో నాకంటూ ఒక ఐడియా ఉంది ఇక నుండి నేను విజృంభిస్తా అంటూ సవాల్ చేసింది.


ఈ క్రమంలో బాబా భాస్కర్ శిల్ప చక్రవర్తి కి ఒకరోజు గారి వారం రోజులు గమనించు తర్వాత హౌస్ నుండి కూడా వెళ్ళిపోవచ్చు అంటూ పంచ్ వేశారు. ఆ మాట తనకు నచ్చలేదని బాబాకి మొహం మీదే చెప్పింది శిల్పా. ఇక శిల్పాకి శ్రీముఖికి పడదని.. వారిద్దరికీ ఏవో పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాహుల్ తో గుసగుసలాడింది పునర్నవి.ఈ వారం టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్‌కు దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చారు. దొంగలు ముఠా, నగర వాసులు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టి గేమ్ ఆడించారు. దొంగలకు రాణిగా శిల్పాను పెట్టారు.


గేమ్ మొదలైన తరువాత టాస్క్ మొత్తం హింసాత్మకంగా మారిపోయింది. ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రచ్చ చేశారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ లివింగ్ ఏరియాలోకి పిలిచి హౌస్‌లో హింసకు తావులేదని చెప్పారు. అయినాగానీ టాస్క్ పరంగా ఇంటి లోని సభ్యులు తన్నుకోక తప్పలేదు. ఇదే టాస్క్ రాబోయే ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ కానుంది. మొత్తం మీద జరిగిన టాస్క్ లో భాగంగా శ్రీముఖి శిల్ప చక్రవర్తి లా మధ్య ఏవో పాత గొడవలు ఉన్నట్లు అర్థం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: