కోలీవుడ్ సూపర్ స్టార్ కూతురు సౌందర్య, ఆమె భర్త విశాకన్ లండన్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు దొరికిపోయారు. చెన్నై నుండి 3 డేస్ బ్యాక్ లండన్ వెళ్లిన సౌందర్య, విశాకన్ లండన్ ఎయిర్ పోర్ట్ లో తన పాస్ పోర్ట్.. ఇంకా అమెరికన్ డాలర్లు ఉన్న బ్రీఫ్ కేస్ పోగొట్టుకున్నారట. ఎయిర్ పోర్ట్ సిబ్బంది పాస్ పోర్ట్ చూపించినమని అడిగీ టైంలో పాస్ పోర్ట్ వారి వద్దల్ లేదట. 


వెంటనే ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఈ స్టార్ కపుల్ ఫిర్యాదు చేశారట. పాస్ పోర్ట్ లేకుండా అనుమతించమని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాసేపు హడావిడి చేశారట. విషయం తెలుసుకున్న రజిని గవర్నమెంట్ అఫిషియల్స్ తో మాట్లాడి అక్కడ భారత దౌర్య అధికారుల చేత తాత్కాలిక పాస్ పోర్ట్ రెడీ చేసి వారికి ఇచ్చారట.


ప్రస్తుతానికి సమస్య తీరినట్టే.. కాని విశాకన్ ఇంకా సౌందర్యల పాస్ పోర్ట్, డాలర్స్ ఉన్న బ్యాగ్ ఎలా మిస్ అయ్యిందన్న దాని మీద విచారణ జరుపుతున్నారు. రజినికాంత్ జోక్యంతో సమస్య సాల్వ్ అయ్యింది. అయితే తాత్కాలిక పాస్ పోర్ట్ వచ్చేదాకా ఎయిర్ పోర్ట్ లోనే వారిని వెయిట్ చేయించినట్టు తెలుస్తుంది.


ఏది ఏమైనా విదేశాలకు వెళ్లినప్పుడు పాస్ పోర్ట్ ఇంకా మనీ విషయాల్లో చాలా జాగ్రత్తలు వచించాల్సి ఉంటుంది. అక్కడ మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల ప్రభుత్వాలు జోక్యం చేసుకునే దాకా పరిస్థితి వెళ్తుంది. రజిని ఉన్నాడు కాబట్టి మిస్సింగ్ పాస్ పోర్ట్ మ్యాటర్ నుండి వెంటనే బయట పడ్డారు. ఆ పొజిషన్ లో కామన్ మాన్ ఉంటే మాత్రం చాలా కష్టం అయ్యేది. ఇక సినిమాల విషయానికి వస్తే రజినికాంత్ ప్రస్తుతం మురుగదాస్ డైరక్షన్ లో దర్బార్ సినిమా చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: