అందాల  తార జెనిలియా తెలుగులో సుమంత్ హీరోగా నటించిన "సత్యం" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది .జెనిలియా తెలుగు ప్రేక్షకులకు హసిని గా ఎక్కువ పరిచయం.లవర్ బాయ్ సిద్దార్థ మరియు జెనిలియా జంటగా నటించిన "బొమ్మరిల్లు" సినిమాలో  అమాయకపు ఆడపిల్లగా ఆమె నటనను  చూసి  ప్రేక్షకులకు మైమరిచిపోయారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కిన బోమ్మరిల్లు సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత తెలుగు తమిళ హిందీ భాషల్లో  అగ్ర కథనాయకులతో నటించింది.


బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని 2012 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత మళ్లీ సినిమాల్లో నటించలేదు.జెనిలియాకు 
ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీసెంట్ గా జెనిలియా ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు . నా జీవితంలో నేను చాలా దశలను దాటుకుంటూ వచ్చాను. సినిమాల్లో నటించేటపుడు నాకు సినిమాలే ప్రపంచం. ఎక్కువగా సినిమాల గురించే ఆలోచించే దాన్ని.  పెళ్లి చేసుకున్న తరువాత ఒక మంచి గృహిణి ఉన్నాను. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిని.నేను మళ్లీ సినీ కెరియర్ ని మొదలుపెట్టలని అనుకుంటున్నాను..గత కొన్ని రోజులగా కథలను వింటున్నాను కానీ ఎది నచ్చాలేదు అని  చెప్పింది


 నా జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం అనేది ఒక తియ్యని అవుభుతి. పిల్లలతో మరియు రితేష్ దేశ్ ముఖ్ తో ఉంటే రోజులు క్షణాల్ల గడిచిపోతున్నాయి. మళ్లీ సినిమాల్లో నటించాలని మరియు జీవితంలో కొత్త విషయాలను కనుక్కొవాలి అని ఉంది. వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో అది మనమే డిసైడ్ చేసుకోవాలి అని  చెప్పింది. జీవతం అనేది  ఎవరికి అంతుచిక్కనిది. ఒక క్షణం మనుకు అన్ని తెలుసు అనుకుంటాం. మళ్లి అంతలోనే అయోమయంలో పడిపోతాం అని చెప్పింది. జెనిలియా రిసెంట్ గా ఒక ఫోటో షూట్ కూడా చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: