బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయిలో హిట్టు కొట్టాలని దాదాపు రెండు సంవత్సరాల పాటు సాహో సినిమా ప్రభాస్ చేయడం జరిగింది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం జరగటం జరిగింది. అయితే సినిమా రెండు సంవత్సరాల చిత్రీకరించిన గాని సినిమాలో దమ్ము లేకపోవడంతో సినిమా రిలీజ్ అయిన మొట్టమొదటి షో కే అట్టర్ ఫ్లాప్ అని టాక్ బయటకు రావడంతో పూర్తిగా నీరుగారిపోయాయి ప్రభాస్ అభిమానులు మరియు దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి క్రేజ్ నీ క్యాష్ చేసుకోవటానికి సాహో సినిమా తన స్నేహితులతో నిర్మించడం జరిగింది.


అయితే ఆశించిన స్థాయిలో సినిమా ఫలితం రాకపోవడంతో సాహో సినిమా పై ప్రభాస్ పెట్టుకున్న ఆశలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి.ఇటువంటి నేపథ్యంలో నెక్స్ట్ సినిమా లేట్ చేయకుండా మొదలు పెట్టేసాడు ప్రభాస్. జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్( వర్కింగ్ టైటిల్) అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా లో పూజా హెగ్డే టీచర్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.


అయితే లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాలలో ప్రభాస్ కనిపించనున్నట్లు సమాచారం. దీంతో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రభాస్ ని యాక్షన్ ఓల్డ్ ఏజ్ సన్నివేశాల్లో చూసిన అభిమానులు చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ రొమాంటిక్ సన్నివేశాల్లో ప్రభాస్ కనిపిస్తున్నాడని వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు..ప్రభాస్ సినిమాలో కనిపించబోతున్నాడో అని తెగ ఆత్రుత పడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: