మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు.     


సినిమాలో కేవలం వీరే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్వీటీ అనుష్క ఇద్దరు సర్ ప్రైజ్ చేస్తారట. నరసింహా రెడ్డి ఉరితో సినిమా పూర్తి చేయకుండా మరో పది నిమిషాల పాటు సినిమా ఉంటుందట. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందట. ఇక ఝాన్సి లక్ష్మీ బాయిగా అనుష్క అదరగొడుతుందట. 


సైరా చివర్లో వీరిద్దరితో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ తో పాటుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేలా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంది.       


తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ రోల్ లో నటిస్తుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా స్పెషల్ ఎంట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు.  మెగా ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా వారం ముందే దసరా పండుగ తెచ్చేలా ఉంది. చిరంజీవి డైలాగ్స్, యాక్షన్, స్క్రీన్ స్పేస్ అన్ని సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని తెలుతుంది. మరి సైరా సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి.     
       



మరింత సమాచారం తెలుసుకోండి: