పూరి జగన్నాథ్ తో నిర్మాణ సారథ్యంలో భాగం పంచుకున్న హీరోయిన్ ఛార్మి.. పూరి జగన్నాథ్ చేసే ఇటీవల సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ముందు వరకు ఎటువంటి హిట్స్ లేవు..అదేవిధంగా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఆఖరికి ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం చేతిలో ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకుని అప్పులు చేసి సినిమా నిర్మించడం జరిగింది. అయితే చివరాకరికి ఇస్మార్ట్ శంకర్ సినిమా మొత్తం పూర్తి చేసి ఈ ఏడాది జూలై 18 వ తారీఖున విడుదల చేసి అద్భుతమైన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న సమయంలో పూరి జగన్నాథ్ ని పట్టించుకుని ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడైతే పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడో పూరి జగన్నాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.


పూరి ఇస్ బ్యాక్ అంటూ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్ హీరోలు ప్రముఖులు ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడం పై కామెంట్లు చేశారు. కాగా తనకు సూపర్ డూపర్ హిట్ రావడంతో చాలాకాలానికి..తనలాంటి డైరెక్టర్లు ఫ్లాపుల్లో ఉండిపోయి మానసికంగా ఆర్థికంగా నిస్సహాయంగా కృంగిపోయి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లకు ఇటీవల పూరి జగన్నాథ్ తన పుట్టినరోజు నాడు 50 వేల చొప్పున 30 మంది ఆర్థికంగా కోల్పోయి నీసహాయకంగా ఉన్న డైరెక్టర్లకు సాయం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ఛార్మి మాట్లాడుతూ. పూరి జగన్నాథ్ ప్లాపుల్లో ఉన్న సమయం లో పడిన కష్టాలు గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చింది.


అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా స్టోరీ హీరో రామ్ కి చెప్పిన సందర్భంలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేవు కనీసం యాభై వేలు కూడా లేవు. కానీ రామ్ సినిమా ఒప్పుకున్నాడు మమ్మల్ని నమ్మాడు దానికి కృతజ్ఞతలు. చాలావరకు పూరి జగన్నాథ్ ని నన్ను ఆదుకున్నది హీరో రామ్ అంటూ సినిమా చేస్తున్న సందర్భంలో ఆర్థిక విషయాలు భావోద్వేగంతో మాట్లాడింది చార్మి. అంతేకాకుండా పూరి ఫ్లాపుల్లో ఉన్నాగాని స్టోరీ ఏమీ వినకుండానే రామ్ ఓకే చేసాడని కృతజ్ఞతలు తెలిపింది చార్మి. మొత్తం మీద ఇస్మార్ట్ శంకర్ సినిమా ముందు ఏటువంటి పరిస్థితుల్లో పూరిజగన్నాథ్ ఉన్నాడో...ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు పూరి జగన్నాథ్ సహాయం చేయడం లేదు కేవలం తనకు వచ్చిన ఆనందాన్ని పంచుకున్నారు అని చార్మి ఈ కార్యక్రమంలో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: