టాలీవుడ్ లో తమ అందాలతో ఒక్క ఊపు ఊపిన హీరోయిన్లు రంభ, రాశి లకు కోర్టు షాక్ ఇచ్చింది.  ప్రస్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.  అయితే రంభ ఆ మద్య కొన్ని రియాల్టీ షో ల్లో జడ్జీగా వ్యవహరించారు.  ఇటీవల తన మూడో పాపకు జన్మనిచ్చింది.  తాజాగా వినియోగదారుడు కోర్టులో కేసు వేయడంతో ఈ  అందాల భామలకు కోర్టు షాక్ ఇచ్చింది. 

కలర్స్ అనే సంస్థలో రాశి, రంభ లాంటి సినీ తారల ప్రకటనలు చూసి మోసపోయానంటూ విజయవాడ వినియోగదారుల ఫోరానికి ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు.  దీంతో వీరిద్దరూ చేసిన వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయోద్దంటూ ఫోరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా,  9 శాతం వడ్డీతో మొత్తం రూ.74,652లు బాధితుడికి వెంటనే చెల్లించాలని ఆదేశించారు.  గతంలో పలువురు సినీ తారలు చేసిన నటించిన యాడ్స్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొంత మంది బాధితులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం కూడా తెలిసిందే.  దాంతో ఆ వ్యాపార ప్రకటనలపై కోర్టు సీరియస్ కూడా అయ్యింది. 

తాజాగా కలర్స్ అనే సంస్థలో రాశి, రంభ లాంటి సినీ తారల ప్రకటనలు చూసి మోసపోయానంటూ విజయవాడ వినియోగదారుల ఫోరానికి ఓ బాధితుడు ఫిర్యాదు కోర్టు ఈ విషయంపై సీరియస్ అయ్యింది. సెలబ్రిటీస్ అయిన రాశీ, రంభ లాంటి హీరోలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని… ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రెటీస్ కు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. మరి దీనిపై ఈ ఇద్దరు భామలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: