టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో, కాసేపటి క్రితం యుఎస్ఏ మరియు యుఎఈ వంటి ప్రాంతాల్లో జరిగింది. అక్కడి నుండి వస్తున్న రిపోర్టులను బట్టి, సైరా ఓవర్ ఆల్ గా అదరగొట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా కాస్త నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ సినిమాలో అనుష్క ఎంట్రీ ద్వారా నరసింహారెడ్డి పాత్ర ఎంటర్ అవుతుందని అంటున్నారు. అయితే చిరంజీవి ఎంట్రీ సాధారణముగానే ఉంటుందని, కానీ ఆ తరువాత నుండి మెల్లగా సినిమా ఊపు అందుకుంటుందని అంటున్నారు. 

ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయంతో ఎక్కువగా సాగుతుందని, అయినప్పటికీ సినిమాలోని ఫ్లోని ఎక్కడా కూడా మిస్ కాకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో బాగా తెరకెక్కించినట్లు చెప్తున్నారు. అయితే ఇంటర్వెల్ వరకు పర్వాలేదనిపించిన సినిమా, ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వచ్చే అండర్ వాటర్ ఫైట్ తో ఒక్కసారిగా మంచి ఊపు అందుకుంటుందని, దాని తరువాత వచ్చే సన్నివేశం అదిరిపోతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో ఎక్కువగా యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయని, మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ సినిమాలో అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఇక నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార, అలానే లక్ష్మి అనే పాత్రలో తమన్నా తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారని, అలానే గోసాయి వెంకన్నగా అమితాబ్ పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆడియన్స్ ని ఎంతో ప్రభావితం చేసే పాత్ర అని అంటున్నారు. 

ఇకపోతే విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, రవి కిషన్ పాత్రలు సినిమాకు ఎంతో బలాన్ని ఇస్తాయని, అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో గ్రాండియర్ గా వేసిన సెట్టింగులు, విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మధ్యలో వచ్చే రెండు సాంగ్స్ ఈ సినిమాను మంచి హిట్ సినిమాగా మార్చాయని అంటున్నారు. ఇకపోతే సినిమాలో అత్యంత కీలకమైన ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశం ప్రేక్షకులను ఎంతో అలరిస్తుందని, ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ఎంతో హృద్యంగా సాగుతూ ఆడియన్స్ ని కళ్ళ నీళ్లు పెట్టిస్తుందని చెప్తున్నారు. మొత్తంగా సైరా నరసింహారెడ్డి సినిమా ఆకట్టుకునే స్వాతంత్రోద్యమ కథ, కథనాలతో పాటు ప్రేక్షకుడిని సినిమాకు కనెక్ట్ చేసే స్క్రీన్ ప్లే తో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారని అంటున్నారు. ఇక దీనిని బట్టి రేపు మార్నింగ్ షో తరువాత సినిమాకు మంచి టాక్ రావడం ఖాయమని, ఈ సైరా సినిమాతో మెగాస్టార్ మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారని అంటున్నారు మెగా ఫ్యాన్స్.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: