అనుష్క గురించి తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి, భాగమతి వంటి సినిమాలు అనుష్క జీవితంలో చెప్పుకోదగిన గొప్ప సినిమాలని అందరికి తెలిసిందే. ఇక మన స్వీటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా నిశ్శబ్దం. అనుష్క హీరోయిన్ గా  మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్, శాలినీ పాండే, అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గతంలో మంచు విష్ణుతో 'వస్తాడు నా రాజు' అనే ఫ్లాప్ సినిమాని తీసిన డైరెక్టర్ హేమంత్ మధుకర్.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నిశ్శబ్దం సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకు రచన సహకారం అందిస్తూ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. 

ఈ సినిమా మొదలు కావడానికి ముందు నుంచి కోన అండ్ టీం ఈ సినిమా విషయంలో మామూలుగా హడావుడి చేయట్లేదు. దానికి మళ్ళీ  పబ్లిసిటి అన్న పేరు ఒకటి. ముందే అనుష్క లుక్ ఒకటి రిలీజ్ చేయడం.. మాధవన్ తో పాటు మాడిసన్ ఈ సినిమాలో భాగం కావడం గురించి ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ లుక్ ఒకటి.. ఫస్ట్ లుక్ ఒకటి లాంచ్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలోను వీటి గురించి చిత్ర బృందం సొంత డబ్బా కొట్టుకున్నారు.

ఇప్పుడు మాధవన్ ఫస్ట్ లుక్ విషయంలో మళ్ళీ  హడావుడి మొదలుపెట్టారు. ఈ సినిమాలో మాధవన్ మ్యుజీషియన్ పాత్ర చేస్తున్నాడు. ఇక అనుష్క మాట్లాడలేని, వినబడని మ్యూట్ ఆర్టిస్టు పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రల వ్యవహారం చూస్తే మన జనాలకు ఎంతవరకు నచ్చుతుందో చెప్పడం కష్టమే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని ముందునుంచి క్రేజ్ క్రియోట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికి ఇంతవరకు మన ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి కలిగించడంలో మాత్రం సక్సస్ కాలేదు. అనుష్క-మాధవన్ జోడీ అయినా.. హాలీవుడ్ నటుడు ఉన్నా.. ముందు ఈ సినిమా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉంటుందా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్. మరి వాస్తవంగా చూస్తే ఇప్పటివరకు సినిమాకు మన దగ్గర ఇంట్రస్ట్ అయితే క్రియేట్ కాలేదు. మరి టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తేనన్న సినిమాపై ఆసక్తి కలుగుతుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: