టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా షూటింగ్స్ చేసుకుంటూ వెళ్లడంతో పాటు, ఎప్పటికపుడు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు వీలున్నప్పుడల్లా చూడడం, అలానే అవి నచ్చితే తనవంతుగా ట్వీట్స్ చేస్తూ ఆ సినిమాల నటులు మరియు యూనిట్ సభ్యులను అభినందించడం వంటి గొప్ప పనులు తరచూ చేస్తూ ఉంటారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వలె, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా , ఎప్పటికీ ఒదిగి ఉండే సూపర్ స్టార్ అంటే, టాలీవుడ్ లోని ఎంతో మంది నటీనటులకు కూడా ప్రాణం అనే చెప్పాలి. ఇక మహేష్ బాబుకు వీరాభిమాని అయిన విజయ్ దేవరకొండ ఇటీవల మహేష్ నటించిన 25వ సినిమా మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి సూపర్ స్టార్ పై తన ఎనలేని అభిమానాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. 

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న తొలి సినిమా 'మీకు మాత్రమే చెప్తా' టీజర్ ఇటీవల రిలీజ్ అయి, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని తన అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ తో రిలీజ్ చేయించబోతున్నారు విజయ్. నేటి సాయంత్రం 4గం.30ని.లకు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని మహేష్ బాబు లాంఛ్ చేస్తున్నట్లు, మీకు మాత్రమే చెప్తా యూనిట్, నిన్న సాయంత్రం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. 

తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వినయ్ వర్మలు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు షమ్మిర్ సుల్తాన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని, తన తొలి వెంచర్ కి హీరోగా విజయ్ దేవరకొండ ఎన్నుకోవడం ఒక రకంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటికే నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాతో ఎంత మేర విజయాన్ని అందుకుంటాడో చూడాలి. మంచి ఫన్నీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని నవంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: