కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భామ శ్వేతా బసు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్  అడ్డాల దర్శకత్వం వహించగా దిల్ రాజ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్వేతా బసుకి అవకాశాలు వెల్లువలా వస్తాయని అందరూ ఊహించారు. కానీ అలా జరగలేదు సరికదా దానికి రివర్స్ లో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి.


ఈ సినిమా తర్వాత చిన్నా చితకా సినిమాలు చేసినప్పటికీ, హోటల్ లో పట్టుబడ్డ తర్వాత ఆమెకి అవకాశాలు రాకుండా పోయాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దురమైంది. సమస్యల్లోంచి బయట పడ్డ తర్వాత పెళ్ళి చేసుకుని ముంబయి వెళ్ళిపోయింది. అయితే తెలుగులో సినిమాలు లు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో ఆమెకు అవకాశం వచ్చింది. బాలీవుడ్ లో ఆమె "ది తాష్కెంట్ ఫైల్స్" అనే చిత్రంలో నటించింది.


అయితే అదే ఇప్పుడు ఆమె పాలిట వరంలా మారింది. ఈ చిత్రం ఇండియా తరపున ఆస్కార్ బరిలో నిలవనుంది. ఈ మేరకు నిన్ననే సమాచారం రావడంతో ఆమె మీద వార్తలు వెల్లువలా వస్తున్నాయి.
శ్వేతా బసు నటించిన ఈ సినిమా ఆస్కార్ కి వెళ్ళనుండడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఆమెతో  పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శ్వేతాబసుకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


అయితే పస్తుతం బాలీవుడ్ నుండి ఆమెకి ఆఫర్లు వస్తున్నాయట. ఒక్క బాలీవుడే కాదు తెలుగు నిర్మాతలు సైతం ఆమెని మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారట. మరి ఆమె తెలుగు సినిమాలో నటిస్తుందా లేదా అనేది చూడాలి. అలాగే ఇంతకు ముందు దొరకని ఛాన్సెస్ ఈ సారైనా అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: