సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసరుగా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగ విడుదల చేస్తామని ఆ చిత్ర బృందం ప్రకటించింది. అయితే అదే రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా "అల వైకుంఠపురములో" కూడా రిలీజ్ కాబోతుంది.


రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వడంతో ఇద్దరి హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బన్నీ సినిమా నుండి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మొన్న రిలీజైన సామజవరగమనా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో చూశాం. బన్నీ సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ మహేష్ సరిలేరు నుమ్డి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో మహేష్ అభిమానులు నిరాశకి లోనవుతున్నారు.


అయితే దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ జనాలకి బాగా నచ్చుతుందని తెలుసు. ఇక మహేష్‌లాంటి అగ్ర హీరో వున్నాడు కనుక టెన్షన్‌ దేనికని అనుకుంటున్నారేమో. దిల్‌ రాజు అయితే ఈ చిత్రం కూడా ఎఫ్‌ 2లా నవ్వులతో అదరగొట్టేస్తుందని నమ్ముతున్నాడట. ఈ సినిమాలో ట్రెయిన్ ఎపిసోడ్  అందరినీ బాగా నవ్విస్తుందని చెప్తున్నాడట. కామెడీనే గాక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయట.


ఆర్మీ ఆఫీసరుగా ఉండే మహేష్ కొండారెడ్డి బురుజు వద్ద గొడ్డలి పట్టుకుని ఎందుకు నిలబడ్డడనేది ఈ సినిమాలో సస్పెన్స్ గా ఉండనుంది. కేవలం కామెడీనే కాకుండా ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో మంచి యాక్షన్‌ సీన్లు కూడా పడ్డాయట. కమర్షియల్‌గా ఒక స్టార్‌ హీరో చిత్రం నుంచి ఏమి ఆశిస్తారో అవన్నీ ఇందులో వుంటాయని, పోటీ గురించిన చింత అవసరం లేదని మహేష్‌తో సహా అందరూ ధీమాగా వున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: