సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కాగా తాజాగా ఈ సినిమా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ పెళ్లి ఎపిసోడ్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. ఈ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ అండ్ వెన్నెల కిషోర్ మధ్య కొన్ని కామెడీ సీన్లు వస్తాయని.. ఆ సీన్స్ లో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుందని.. పైగా మహేష్ కూడా ఈ ఎపిసోడ్ లో ఫుల్ కామెడీ చేయబోతున్నాడని అందుకే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలెట్ అవుతుందని తెలుస్తోంది. ఇక మహేష్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనింగ్ సబ్జెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బోలెడంత ప్రత్యేకతను సంతరించుకుంది. మహేష్ పూర్తిస్థాయి యాక్షన్ హీరో కాబట్టి సినిమాలో ఫన్ కంటెంట్ మరీ ఎక్కువ ఉండకపోవచ్చనే మొదట్లో అనుమానాలు వచ్చాయి. కానీ సినీ వర్గాల సమాచారం మేరకు సినిమాలో వినోదానికి ఎలాంటి ఢోకా ఉండదట. ముఖ్యంగా ద్వితీయార్థంలో వినోదం పుష్కలంగా దొరుకుతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన 'శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను' చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ 'సరిలేరు నీకెవ్వరు'కు మాత్రం అంతకు మించి ట్యూన్స్ కడుతున్నాడట.
ఇకపోతే సినిమా మొదలయ్యేటప్పుడే మంచి సంగీతం ఇస్తానని దేవి శ్రీ సభా ముఖంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్ లో కనిపించనుందట. తమన్నా 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుందట. ఇప్పటికే అనీల్ రావిపూడి ఆమెను సంప్రదించాడని.. గెస్ట్ రోల్ కు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. అలాగే ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.